జీ తెలుగు ఛానెల్లో ప్రసారమయ్యే ‘సరిగమప’షో ఎంతోమంది సింగర్స్ను తయారు చేసింది. ఇప్పుడు మళ్లీ ‘సరిగమప–ది సింగింగ్ సూపర్ స్టార్’గా ప్రేక్షకులముందుకు రాబోతోంది. ‘ఒక్కొక్కరిది ఒక్కో కథ, అందరిది ఒకే కల’ అంటూ జీ తెలుగు ఛానెల్ వాళ్లు ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ నెల 20న సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే సరిగమప మెగా లాంచ్ ఎపిసోడ్కు స్పెషల్ గెస్ట్గా హీరోయిన్ పూజా హెగ్డే రాబోతోంది. ఈ షోకు యాంకర్గా శ్రీముఖి, జడ్జెస్గా కోటి, ఎస్.పి. శైలజ, సింగర్ స్మిత, అనంత శ్రీరామ్ ఉన్నారు. సరిగమప–ది సింగింగ్ సూపర్ స్టార్ షో ఈ నెల 27 నుంచి రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.
మరిన్ని వార్తల కోసం: