తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాశీ ఖన్నా

తిరుమలలో  శ్రీవారిని దర్శించుకున్న రాశీ ఖన్నా

తిరుపతి: సినీ నటి రాశీ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ దర్శన సమయంలో 'పక్కా కమర్షియల్' చిత్ర నిర్మాత బన్నీ వాసుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయమే ఆలయానికి వచ్చిన రాశీఖన్నా, బన్నీ వాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం ఇచ్చి.. శ్రీవారి లడ్డు ప్రసాదాలను అందజేశారు. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో నిర్మించిన ‘పక్కా కమర్షియల్ ’ సినిమా జులై 1వ తేదీన విడుదల కానున్న నేపధ్యంలో శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు అందుకున్నారు. తాను నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు నటి రాశీఖన్నా తెలిపారు.