Adani News: మేఘా ఇంజనీరింగ్ ఆస్తులపై అదానీ కన్ను.. కొనుగోలుకు చర్చలు..

Adani News: మేఘా ఇంజనీరింగ్ ఆస్తులపై అదానీ కన్ను.. కొనుగోలుకు చర్చలు..

Megha Engineering: దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో అదానీ గ్రూప్ కూడా ఒకటి. ఈ సంస్థ ప్రస్తుతం తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్న సమయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ ఫ్రా సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు చర్చిస్తున్నట్లు వెల్లడైంది. 

ప్రస్తుతం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఉన్న పవర్ ట్రాన్స్ మిషన్ వ్యాపారంలోని ఆస్తులను అదానీ గ్రూప్ కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడైంది. ఇందుకోసం అదానీ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థలు చర్చిస్తున్నట్లు వెల్లడైంది. మేఘా సంస్థకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ ఆస్తులపై అదానీ సంస్థ ద-ృష్టిని కలిగి ఉందని తేలింది. 

ఇదే క్రమంలో అదానీ పవర్ సొల్యూషన్స్ సంస్థ మేఘా సంస్థ ప్రస్తుతం చేపడుతూ నిర్మాణ దశలో ఉన్న కొన్ని ట్రాన్స్ మిషన్ ఆస్తులను కూడా కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోందని వెల్లడైంది. అయితే యూపీలోని మేఘా ట్రాన్స్మిషన్ ఆస్తుల ఎంటర్ ప్రైజ్ విలువ రూ.6వేల నుంచి రూ.7వేల కోట్ల వరకు డీల్ విలువను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు రెండు సంస్థలు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

వాస్తవానికి మేఘా సంస్థ వ్యవస్థాపకులు పి పిచ్చిరెడ్డి అతని మేనల్లుడు పివి కృష్ణా రెడ్డి తమ కంపెనీలో వాటాలు చేతులు మార్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో ప్రస్తుతం ఆస్తుల అమ్మకం వచ్చిందని తెలుస్తోంది. పిచ్చిరెడ్డి తన వాటాను కృష్ణారెడ్డికి విక్రయించాలని చూస్తుండటంతో అందులో భాగంగా కొన్ని ఆస్తుల అమ్మకానికి ప్రక్రియ స్టార్ట్ అయిందని సమాచారం. పీపీ రెడ్డికి మేఘాలో ఉన్న 51 శాతం వాటాల విలువ రూ.15వేల కోట్ల ఉంటుందని తెలుస్తోంది. దీని చెల్లింపు కోసం ఆస్తుల విక్రయం చేపట్టి యాజమాన్య బదిలీ ప్రక్రియను మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని పిచ్చిరెడ్డి ఫ్యామిలీ భావిస్తోంది.