అంబుజా సిమెంట్‌‌ చేతికి మై హోమ్ గ్రూప్ తమిళనాడు ప్లాంట్‌‌

అంబుజా సిమెంట్‌‌ చేతికి మై హోమ్ గ్రూప్ తమిళనాడు ప్లాంట్‌‌
  • డీల్‌‌ విలువ రూ.413.75 కోట్లు

న్యూఢిల్లీ: తమిళనాడులోని తూత్తుకూడి దగ్గరున్న మై హోమ్‌‌ గ్రూప్ సిమెంట్‌‌ గ్రైండింగ్ ప్లాంట్‌‌ను రూ.413.75 కోట్లకు అంబుజా సిమెంట్స్‌‌ కొనుగోలు చేయనుంది.  ఇందుకు సంబంధించి ఇరు కంపెనీలు అగ్రిమెంట్స్‌‌పై సంతకాలు చేశాయి. ఈ ప్లాంట్ కెపాసిటీ 1.5 మిలియన్ టన్స్​ పర్​ ఆనమ్​ (ఎంటీపీఏ).

  తమిళనాడు, కేరళలలోని కోస్టల్ రీజియన్‌‌లో విస్తరించడానికి ఈ ప్లాంట్ సాయపడుతుందని  అంబుజా సిమెంట్స్‌‌ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో  పేర్కొంది. అదానీ గ్రూప్‌‌కు చెందిన ఈ సిమెంట్ కంపెనీ కెపాసిటీ ప్రస్తుతం 78.9 ఎంటీపీఏ. ఈ డీల్‌‌లో భాగంగా ఉద్యోగులు, డీలర్ నెట్‌‌వర్క్‌‌ కూడా అంబుజా సిమెంట్స్ చేతికి రానున్నాయి.