ప్రభుత్వం  పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : అడిషనల్ కలెక్టర్ సంచిత్‌‌‌‌‌‌‌‌ గంగ్వార్‌‌‌‌‌‌‌‌

ప్రభుత్వం  పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : అడిషనల్ కలెక్టర్ సంచిత్‌‌‌‌‌‌‌‌ గంగ్వార్‌‌‌‌‌‌‌‌

కోస్గి, వెలుగు : ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందిస్తున్నామని అడిషనల్ కలెక్టర్ సంచిత్‌‌‌‌‌‌‌‌ గంగ్వార్‌‌‌‌‌‌‌‌ అన్నారు. శుక్రవారం కోస్గి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

డీఈవో గోవిందరాజులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని తగిన ప్రణాళికతో బడిబాట నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో శంకర్ నాయక్, కోస్గి తహసీల్దార్​శ్రీనివాసులు, మండల అభివృద్ధి అధికారి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, రాజేంద్ర కుమార్, యాదయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు.