వడ్డీ వ్యాపారులపై కొరడా .. ఆదిలాబాద్ జిల్లాలో 11 కేసుల నమోదు

వడ్డీ వ్యాపారులపై కొరడా .. ఆదిలాబాద్ జిల్లాలో 11 కేసుల నమోదు
  • పలువురి అరెస్ట్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ​జిల్లాలో రైతులు, అమాయక ప్రజల వద్ద అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తున్న  వ్యాపారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. డీఎస్పీ జీవన్​రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏకకాలంలో జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 20 పోలీసు బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

 వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులు, రిజిస్టర్లు, స్థలాల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు.