‘ఆది పురుష్’ టీజర్ వచ్చేసింది

‘ఆది పురుష్’ టీజర్ వచ్చేసింది

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శత్వం తెరకెక్కిన ఈ మూవీలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.. సైఫ్‌అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. భూమీ కుంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయం సర్వ నాశనమంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. రాముడిగా అతడి లుక్ ఆకట్టుకుంది. పది తలాల రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించాడు. రాముడి రూపంలో రామ సేతుపై ప్రభాస్ నడిచి వచ్చే సీన్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. ఈ టీజర్ తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సినిమాలో హీరో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా, కృతి సనన్ సీతా దేవి పాత్రలో అలరించనున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్నన ఈ చిత్రం... పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యప్తంగా విడుదల కానుంది.