
- 1982 నుంచి 1985 వరకు గోదావరి ఖనిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎన్ఎస్ యూఐ కాలేజీ ప్రెసిడెంట్గా, 1986 నుంచి 1994 వరకు కరీంనగర్ జిల్లా ఎన్ఎస్ యూఐ జనరల్ సెక్రటరీగా పని చేశారు.
- 1994 నుంచి1996 వరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- 1996 నుంచి 2001 వరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
- 2006లో మాతంగి నర్సయ్య (మూడు సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి)పై ధర్మారం మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచారు.
- 2009 పునర్విభజన తర్వాత ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 1,365 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా పని చేశారు.
- 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సంస్థ చైర్మన్గా చేశారు. అదే సమయంలో పీసీసీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
- 2014లో ఎమ్మెల్యే గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.
- 2018లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
- 2023లో ధర్మపురి నియోజకవర్గం నుంచి 22,000 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పూర్తి పేరు: అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పుట్టిన తేదీ: 01.04.1968
జన్మస్థలం: పెద్దపల్లి
తల్లిదండ్రులు: అడ్లూరి నాగయ్య, లక్ష్మి
కులం: ఎస్సీ (మాదిగ)
విద్యార్హత: పెద్దపల్లిలో ఇంటర్మీడియట్, ఐటీఐ (ఎంఎం)