కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సీసీసీ నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో ఆదివారం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సింగరేణి ఉద్యోగుల పిల్లల ప్రత్యేక కోటా కింద150 సీట్లను కేటాయించి, అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు.
సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్, మైనింగ్ విభాగాల్లో 30 సీట్ల చొప్పున సీట్లు పొందేందుకు సింగరేణి ఉద్యోగుల పిల్లలు అర్హులని కాలేజీ ప్రిన్సిపాల్ నీల్కుమార్ తెలిపారు.
జూన్ 8 లోగా ఆన్లైన్లో https://scp.scpolytechnic.com/counseling/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం 8790112515, 9908151618, 9010222161 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
