బషీర్ బాగ్, వెలుగు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అఫ్జల్గంజ్పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్పాల్గొన్నారు. గౌలిగూడా సెంట్రల్ గురుద్వారా వద్ద పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో శోభాయాత్రను రాత్రి 10 గంటల లోపు ముగించకుండా కొనసాగించారు.
అంతేకాకుండా శోభాయాత్రలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అఫ్జల్ గంజ్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్.. రాజాసింగ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.