మోదీ చరిష్మా మళ్లీ రుజువైంది : మహారాష్ట్ర సీఎం ఏక్‌‌‌‌నాథ్ షిండే

మోదీ చరిష్మా మళ్లీ రుజువైంది : మహారాష్ట్ర సీఎం ఏక్‌‌‌‌నాథ్ షిండే

ముంబై: ప్రధాని మోదీ దేశంలోని ప్రతి వ్యక్తి మనసులో  ఉన్నారని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్​ షిండే పేర్కొన్నారు. చత్తీస్‌‌‌‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌‌‌‌లో బీజేపీ గెలుపుతో ఆయన చరిష్మా మళ్లీ రుజువైందని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహం, కార్యకర్తల కృషి ఫలించిందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన తప్పుడు వాగ్దానాలను ప్రజలు తిరస్కరించారని అన్నారు.

రైతుల రుణాలు మాఫీ చేస్తానని రాహుల్ రాజస్థాన్‌‌‌‌లో  హామీ ఇచ్చారని, ఐదేండ్లు గడుస్తున్నా దాన్ని అమలే చేయలేదని షిండే విమర్శించారు. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పారన్నారు. మోదీ జీ చరిష్మా రోజు రోజుకి చాలా వేగంగా పెరుగుతోందని, మహిళలు, రైతులు మోదీకి మద్దతుగా నిలిచారని షిండే చెప్పారు.