
- రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాలుసాగు చేయడానికి 26న వేలం
- రూ.2 వేలు చెల్లించి పాల్గొనాలన్న దేవస్థానం
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని బాలాజీ వెంకటేశ్వ ర స్వామి ఆలయం కింద ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు చేయడానికి త్వరలో వేలం పాట నిర్వహించానున్నారు. చేవెళ్ల మండలంలోని కుమ్మెర, ఖానాపూర్, కేసారం, మల్కాపూర్ పామెన, గుండాల గ్రామాలు, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని పెద్ద ఉమ్మెంతల, చంగోములు, మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం, శ్రీరాంనగర్, షాబాద్ మండలంలో మల్లారెడ్డిగూడ, బొబ్బిలిగాం, తాళ్ళపల్లి, రేగడి దోసవాడ, చందనెల్లి, సోలిపేట, ఫరూఖ్ నగర్ మండలంలోని దూసుకల్, ఫరూఖ్ నగర్,శంషాబాద్ మండలంలోని పాలమాకుల, రామాంజపూర్, మల్కారం, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నిజాంపూర్,పెద్దాపూర్, కొండాపూర్ మండలంలోని మారేపల్లి, పటాన్ చెరువు మండలంలోని రుద్రారం, ఇస్నాపూర్ గ్రామాల్లోని వేల ఎకరాల్లో సాగు చేయడానికి ఈ నెల 26న బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు. బాలాజీ టెంపుల్ లో జరిగే వేలంలో ఆసక్తి ఉన్న రైతులు రూ.2వేలు చెల్లించి పాల్గొనాలని దేవస్థానం ఈఓటీ నరేందర్, వ్యవస్థాపక ధర్మకర్త వామనాచార్యులు తెలిపారు.