శశికళ సంచలన నిర్ణయం..రాజకీయాలకు గుడ్ బై

శశికళ సంచలన నిర్ణయం..రాజకీయాలకు గుడ్ బై

తమిళనాడులో ఏఐడీఎంకే బహిష్కృ నేత వీకే శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. డీఎంకేను ఓడించాలంటూ అన్నాడీఎంకే  కార్యకర్తలకు పిలిపునిచ్చారు జయలలిత బంగారు పాలన తమిళనాడులో కొనసాగాలని కోరారు.  ‘‘జయలలిత జీవించి ఉన్నప్పుడు నేనెప్పుడూ పదవులు, అధికారాన్ని కోరుకోలేదు. ఆమె లేనప్పుడు కూడా నేను వాటిని తీసుకోను. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. అయితే ఆమె పార్టీ గెలవాలని ప్రార్థిస్తున్నా. జయలలిత వారసత్వం కొనసాగాలని కోరుకుంటున్నా.’’ అంటూ శశికళ ప్రకటన చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలుశిక్ష అనుభవించిన శశికళ జనవరి 27న విడుదలయ్యారు. ఏప్రిల్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శశికళ తిరిగి అన్నాడీఎంకేలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది కానీ ఇంతలోనే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.