న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్గా రమేష్ చెన్నితలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా, కేరళకు చెందిన రమేశ్ చెన్నితల కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా సేవలందించారు. ప్రస్తుతం హరిపాడ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.