ఆ రెండు కప్స్‌‌ గెలవాలి

ఆ రెండు కప్స్‌‌ గెలవాలి

న్యూఢిల్లీ: ఇండియాకు ఆసియా కప్‌‌, టీ20 వరల్డ్‌‌కప్‌‌ను గెలిపించి పెట్టడమే తన ముందున్న లక్ష్యమని మాజీ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ స్పష్టం చేశాడు. దీనికోసం తన వంతు కృషి చేస్తానని చెప్పాడు. ‘రన్స్‌‌ చేస్తున్నప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఉంటా. నాకు ప్రేరణ, స్ఫూర్తి కూడా అదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసియా, టీ20 కప్‌‌ గెలిపించాలి. దీనికోసం నేను బ్యాలెన్స్‌‌గా ఉంటూ ముందుకెళ్లాలి. కొంత విశ్రాంతి తర్వాత మళ్లీ ఆట మొదలుపెడతా. ఒక్కసారి కుదురుకుంటే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదు’ అని కోహ్లీ పేర్కొన్నాడు