లాక్ డౌన్ బ్రేక్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే

లాక్ డౌన్ బ్రేక్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే

బారికేడ్లు తొలగించాలని కానిస్టేబుల్ పై ఒత్తిడి

హైదరాబాద్: ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని తెలుస్తోంది. శుక్రవారం ఓల్డ్ సిటీలోని దబీర్ పురా ఫ్లై ఓవర్ వద్ద ఉన్న బారికేడ్లను తొలగించాలని పోలీసులపై అబ్దుల్లా ఒత్తిడి చేశారని సమాచారం. దీనికి సంబంధించిన ఓ వీడియోలో బారికేడ్ దగ్గర మోహరించి ఉన్న కానిస్టేబుల్ ను వాటిని తొలిగించి వాహనాల రాకపోకల కోసం బ్రిడ్జ్ ను క్లియర్ చేయాల్సిందిగా అబ్దుల్లా బలవంతం చేశారు. కాగా, ఈ ఘటనలో అబ్దుల్లా ప్రవర్తనను బీజేపీ ఖండించింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి బాగా నమ్మకస్తుడిగా అబ్దుల్లాకు పేరుంది. కరోనా క్లస్టర్ అయిన మలక్ పేట్ లాంటి యాక్టివ్ జోన్స్ లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.