ఢిల్లీలో కాలుష్యం కష్టాలు: చర్యలు తీసుకున్నా మారని పరిస్థితులు

ఢిల్లీలో కాలుష్యం కష్టాలు: చర్యలు తీసుకున్నా మారని పరిస్థితులు

ఢిల్లీలో కాలుష్యం కష్టాలు కొనసాగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గాలి కాలుష్యం ప్రమాదకరంగానే నమోదమవుతోంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేంజర్ గానే ఉంది. అశోక్ విహార్, ఆనంద్ విహార్ లో AQI 309 పాయింట్లుగా ఉంది. ఇది అత్యంత ప్రమాదకరస్థితి. లోధి ఏరియాలో AQI 201గా ఉంది. గత వారం రోజుల్లో ఇదే అత్యధికం. చలి తీవ్రత పెరగడంతో.. గాలి కాలుష్యం పెరుగిపోతోందని అధికారులు చెబుతున్నారు. గాలి కాలుష్యానికి మంచు కూడా తోడైంది. దీంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.