ఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ..ఏక్యూఐ 301 గా నమోదు 

ఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ..ఏక్యూఐ 301 గా నమోదు 

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో కంటిన్యూ అవుతోంది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 301గా నమోదైంది. నిన్న ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో కాలుష్యం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 

కొన్ని ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువే నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎయిర్ పొల్యూషన్ తో పాటు పొగ మంచు కూడా కురుస్తోంది. పొగ మంచుతో సాయంత్రం నుంచి ఉదయం 9.30 గంటల వరకు రోడ్డు సరిగా కనిపించక వాహనదారులు, మార్నింగ్ వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు,ఎయిర్ పొల్యూషన్ తో చిన్నారులు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఢిల్లీ వాసులు చెబుతున్నారు.