హైదరాబాద్-తిరుపతి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య.. టేకాఫ్ అయిన 10 నిమిషాల్లోనే ల్యాండింగ్

హైదరాబాద్-తిరుపతి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య.. టేకాఫ్ అయిన 10 నిమిషాల్లోనే ల్యాండింగ్

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పెస్ జెట్ విమానంలో సాంకేతిం లోపం తలెత్తింది. గురువారం (జూన్ 19) ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన 10 నిమిషాలకే విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎయిర్‎పోర్టు అధికారులకు సమాచారం అందించాడు. అధికారుల సూచన మేరకు విమానాన్ని మళ్లీ తిరిగి హైదరాబాద్‎కు మళ్లించారు. విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో విమానం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. 

దీంతో మొత్తం 80 మంది ప్రయాణికులను వేర్వేరు విమానాల్లో తిరుపతి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాంకేతిక సమస్యను పైలట్ ముందుగానే గుర్తించి అప్రమత్తమం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో అధికారులు,  ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడానికి గల కారణాలను నిపుణుల బృందం ఆరా తీస్తోంది. ఆ తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్ ఏంటన్న దానిపై ఒక క్లారిటీ రానుంది. 

2025, జూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే మెడికల్ కాలేజీ బిల్డింగ్‎పై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది, బయట మరో 30 మంది వరకు మరణించారు. ఈ విషాద ఘటన నుంచి దేశం ఇంకా పూర్తిగా తేరుకోకముందే.. వరుసగా విమానాల్లో చోటు చేసుకుంటున్న సాంకేతిక సమస్యలు ప్లయిట్ జర్నీ అంటనే భయపడేలా చేస్తున్నాయి.