న్యూఢిల్లీ: సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్యకు కరోనా పాజిటివ్గా తేలింది. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఐశ్వర్యకు పాజిటివ్గా రావడంతో ప్రస్తుతం ఆమెను ఇంటి వద్దే హోం క్వారంటైన్లో ఉంచారు. ఈ వార్తను స్వయంగా ఐశ్వర్యానే కన్ఫర్మ్ చేశారు. రీసెంట్గా హీరో అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు ధ్రువ్ సర్జాతోపాటు ఆయన వైఫ్కు పాజిటివ్గా తేలింది.
‘ఇటీవలే నాకు కరోనా టెస్టులు చేశారు. అందులో పాజిటివ్గా రావడంతో నేను ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటున్నా. ప్రొఫెషనల్ మెడికల్ టీమ్ సూచనల మేరకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. గత కొన్ని రోజుల్లో నాతో కాంటాక్ట్లో ఉన్న వారు దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి వద్దే క్షేమంగా ఉండండి. మాస్కులు తప్పక కట్టుకోండి. మెరుగైన ఆరోగ్యంతో త్వరలో మీ ముందుకు వస్తా’ అని ఐశ్వర్య చెప్పింది. తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా 2013లో పట్టాత్తు యానై సినిమాతో ఐశ్వర్య తన కెరీర్ను ప్రారంభించింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. చివరగా 2018లో ప్రేమ బారహ మూవీలో యాక్ట్ చేసింది.