
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాయ్బరేలీలోని పిపలేశ్వర హనుమాన్ ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పోటీ చేస్తున్న రాయ్బరేలీ సెగ్మెంట్లోని పలు పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. పలువురు ఓటర్లు ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. కొందరు జర్నలిస్టులు రాహుల్తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాహుల్ వెంట పలువురు కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. బీజేపీ తరఫున రాహుల్పై పోటీ చేస్తున్న దినేశ్ ప్రతాప్ సింగ్.. గోరా బజార్లోని కేంద్రీయ విద్యాలయ్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.