కర్హాల్ నుంచి అఖిలేష్ పోటీ

కర్హాల్ నుంచి అఖిలేష్ పోటీ

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. అందుకే మెయిన్ పురి పార్లమెంట్ నియోజకవర్గంలోని కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మెయిన్ పురి జిల్లా ఎస్పీకి కంచుకోట. ఇక్కడ ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో కర్హాల్ నియోజకవర్గం ఒకటి. సమాజ్ వాదీ  వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ మెయిన్ పురి పార్లమెంట్ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇక్కడ సమాజ్ వాదీ పార్టీకి మంచి పట్టుంది. కర్హాల్ లో అఖిలేష్ గ్రాండ్ విక్టరీ సాధిస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

యూపీలో బీజేపీ నాలుగో జాబితా విడుదల

కొవిన్ పోర్టల్లో రెండు కొత్త అప్డేట్లు