యూపీలో బీజేపీ నాలుగో జాబితా విడుదల

యూపీలో బీజేపీ నాలుగో జాబితా విడుదల

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 85 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇందులో బీసీలకు 30, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 19 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ఫోర్త్ లిస్ట్ లో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు కలిపి 49 సీట్లు కేటాయించింది. ఓబీసీ కేటగిరిలో లోధి కులానికి చెందిన అభ్యర్థులకు 10, కుర్మీలకు ఏడు, నిషాద్, యాదవ్ లకు ఒక్కొక్కరికి టికెట్లు ఇచ్చారు. మౌర్యులు, కుష్వాహులు, శాక్యులకు 11 సీట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 195 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు కమలనాథులు. యూపీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, సమాజ్ వాద్ పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల మధ్య చతుర్ముఖ పోరు జరిగే అవకాశం ఉంది. 


మరిన్ని వార్తల కోసం

కొవిన్ పోర్టల్లో రెండు కొత్త అప్డేట్లు

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు