
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి మానవత్వం చాటుకున్నాడు. భారీ వర్షాలతో నష్టపోయిన బీహార్ వరద బాధిత ఫ్యామిలీకి ఆర్ధిక సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. నష్టపోయిన 25 కుటుంబాలకు కలిపి రూ. కోటి ఇస్తున్నట్లు తెలిపాడు. దీనివల్ల ఒక్కో ఫ్యామిలీ రూ.4లక్షలు అందుకోనుంది. ఈ ఆగస్టులో కూడా అసోం సీఎం నిధికి అక్షయ్ రూ.కోటి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
దీంతో మనసున్న రియల్ హీరో అంటూ అక్షయ్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అక్షయ్ నటించిన లేటెస్ట్ మూవీ హౌస్ ఫుల్ 4 సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే.