ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ విఘాతకుడు: ఆకునూరి మురళి

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ విఘాతకుడు: ఆకునూరి మురళి
  • ఎందరో అంబేద్కరిస్టులను పొట్టన పెట్టుకున్నడు 
  • రిటైర్డ్​ ఐఏఎస్ ఆకునూరి మురళి
  • జాగో తెలంగాణ, టీఎస్​డీఎఫ్​ ఆధ్వర్యంలో బస్​యాత్ర

ఆమనగల్లు/కల్వకుర్తి, వెలుగు : నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ విఘాతకుడని తెలంగాణ జాగో కన్వీనర్, రిటైర్డ్  ఐఏఎస్  ఆఫీసర్​ ఆకునూరి మురళి ఆరోపించారు. బుధవారం రాత్రి ఆమనగల్లు, కల్వకుర్తి పట్టణాల్లో జాగో తెలంగాణ బస్​యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ ఎందరో అంబేద్కరిస్టులను పొట్టన పెట్టుకున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 రాష్ట్రంలో బీఆర్ఎస్  ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, పదేండ్ల బీఆర్ఎస్, బీజేపీ పాలనలో రాష్ట్రం, కేంద్రంలో అభివృద్ధి అడుగంటిపోయిందన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ముస్లింలు అశాంతితో జీవిస్తున్నారని, సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. కులగణనకు అన్ని పార్టీలు మద్దతిచ్చినా, బీజేపీ ప్రభుత్వం కోర్టులో అడ్డుకుందన్నారు. టీఎస్​డీఎఫ్​మెంబర్లు, ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, పద్మజా షా, జానయ్య, డీబీఎఫ్​ రాష్ట్ర కన్వీనర్​ పులి కల్పన, బ్యాగరి వేణు, పులి నవీన్​ కుమార్​, గోవర్దన్​ రాయ్​ 
పాల్గొన్నారు.