- ఎందరో అంబేద్కరిస్టులను పొట్టన పెట్టుకున్నడు
- రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి
- జాగో తెలంగాణ, టీఎస్డీఎఫ్ ఆధ్వర్యంలో బస్యాత్ర
ఆమనగల్లు/కల్వకుర్తి, వెలుగు : నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ విఘాతకుడని తెలంగాణ జాగో కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఆరోపించారు. బుధవారం రాత్రి ఆమనగల్లు, కల్వకుర్తి పట్టణాల్లో జాగో తెలంగాణ బస్యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎందరో అంబేద్కరిస్టులను పొట్టన పెట్టుకున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, పదేండ్ల బీఆర్ఎస్, బీజేపీ పాలనలో రాష్ట్రం, కేంద్రంలో అభివృద్ధి అడుగంటిపోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ముస్లింలు అశాంతితో జీవిస్తున్నారని, సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. కులగణనకు అన్ని పార్టీలు మద్దతిచ్చినా, బీజేపీ ప్రభుత్వం కోర్టులో అడ్డుకుందన్నారు. టీఎస్డీఎఫ్మెంబర్లు, ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, పద్మజా షా, జానయ్య, డీబీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పులి కల్పన, బ్యాగరి వేణు, పులి నవీన్ కుమార్, గోవర్దన్ రాయ్
పాల్గొన్నారు.