- కావాలనే చేస్తున్నారని సుబ్బారావు ఆగ్రహం..
పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పోలీస్స్టేషన్లో సోమవారం హైడ్రామా చోటు చేసుకుంది. రెండు రోజుల కింద మంగ్లీ తనను బెదిరిస్తున్నారని న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం, తర్వాత తనపై తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నాడని మంగ్లీ అతడిపై రిటర్న్కంప్లయింట్ఇవ్వడం తెలిసిందే. తాజాగా సోమవారం మరో నాటకీయ పరిణామం చోటు చేసుకున్నది.
మంగ్లీపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని న్యాయవాది సుబ్బారావును పంజాగుట్ట పోలీసులు పిలిపించారు. దీంతో కొందరు బాధితులతో కలిసి ఆయన స్టేషన్కు వచ్చారు. అయితే, ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ సుబ్బారావుకు ఆల్కాహాల్టెస్ట్చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసులు బ్రీత్ఎనలైజర్తో సుబ్బారావును పరీక్షించగా, 27 పాయింట్లు వచ్చాయి. దీంతో అతడిని పంపించివేశారు.
బద్నాం చేయాలని చూస్తున్నరు : సుబ్బారావు
‘నేను ఆదివారం రాత్రి మద్యం సేవించాను. అయినా, టెస్టులో నాకు వచ్చింది 27 పాయింట్లు మాత్రమే. నేను నిన్న రాత్రి తాగాను అని చెప్తున్నా పోలీసులు అత్యుత్సాహంతో నన్ను టెస్ట్చేసి బద్నాం చేయాలని చూశారు. మైక్రోఫైనాన్స్విషయంలో మంగ్లీకి కేసుతో ప్రత్యక్ష్య సంబంధం లేదు. ఆమె తమ్ముడిని ఇన్వాల్వ్చేసి పరోక్షంగా నడిపిస్తోంది’ అని అన్నారు.
ఈ సందర్భంగా తన ఫోన్లో ఒక వీడియో చూపించారు. తర్వాత పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో అక్కడి నుంచి బయలుదేరారు. ఈ విషయమై ఇన్స్పెక్టర్రామకృష్ణ వివరణ కోరగా..న్యాయవాది ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి ఆధారాల కోసం పిలిచామని, అతడి దగ్గర మద్యం వాసన రావడంతో టెస్ట్ చేసి పంపించి వేశామన్నారు.

