కార్యకర్త చెంప చెళ్లుమనేలా కొట్టేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే…కానీ

కార్యకర్త చెంప చెళ్లుమనేలా కొట్టేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే…కానీ

ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ అనంతరం విడుదలైన ఫలితాల్లో ఆమ్ ఆద్మీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే , ఆమ్ ఆద్మీ కార్యకర్తల మధ్య వాద్వాగం జరిగింది. ఈ గొడవలో కాంగ్రెస్ ఎమ్మెల్యే.., ఆప్ కార్యకర్తపై చేయిచేసుకునే ప్రయత్నం చేశారు. కానీ తృటిలో తప్పించుకున్నాడు.

ఆమ్ ఆద్మీ పార్టీలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆల్కాలాంబ..ఆ పార్టీ వ్యవహార శైలి నచ్చకపోవడంతో భయటకు వచ్చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆల్కా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఓటింగ్ సరళి గురించి తెలుసుకున్నారు.

ఓటింగ్ కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆమ్ ఆద్మీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ తారాస్థాయికి దిగడంతో ఆల్కా రంగంలోకి దిగారు. ఆప్ కార్యకర్తల్ని వారించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆల్కాలాంబ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆప్ కార్యకర్త చెంప చెళ్లుమనేలా కొట్టే ప్రయత్నం చేశారు. . కానీ ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పక్కకు లాగేశారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు అతన్ని తరిమి వేయడం కనిపించింది.