ఈ నెల 22న సచివాలయం పరిసరాలలో ఉన్న పార్కులు మూసివేత 

ఈ నెల 22న సచివాలయం పరిసరాలలో ఉన్న  పార్కులు మూసివేత 

తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 22వ తేదీన(గురువారం) నూతన సచివాలయం పరిసరాలలో ఉన్న పార్కులకు సెలవు ప్రకటిస్తున్నట్లు హెచ్ఎండిఏ తెలిపింది. ఈ నేపథ్యంలో సందర్శనకు వచ్చే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రకటన చేసింది.  
                                                                       
బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు(బిపిపి) పరిధిలో ఉన్న లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్‌లను గురువారం మూసివేస్తారని హెచ్ఎండిఏ వెల్లడించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరుల స్మారకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 22న ప్రారంభించనున్నారు.