మోడీ టూర్ : కాషాయమయంగా మారిన రామగుండం

మోడీ టూర్ :  కాషాయమయంగా మారిన రామగుండం

ప్రధానమంత్రి మోడీ పర్యటనకు రామగుండంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. మోడీ రాక సందర్భంగా బీజేపీ నేతలు రామగుండం గోదావరిఖని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కాషాయమయంగా మార్చేశారు.

ఏపీ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ మధ్యాహ్నం 1: 30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రగసించిన అనంతరం ఆయన రామగుండం బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఫ్యాక్టరీ పరిశీలించనున్నారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు. సాయంత్రం 6.40గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.