ఓయూ, వెలుగు : ఈ నెల 20న ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని రకాల పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ర్ట అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ర్ట ఎడ్యుకేషన్ డే సందర్భంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ ఎగ్జామ్స్కంట్రోలర్ ప్రొఫెసర్రాములు ఒక ప్రకటనలో వెల్లడించారు.
వాయిదా పడిన పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ మార్పులను విద్యార్థులు గమనించాలని కోరారు.