హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ తొలి విడుత కౌన్సిలింగ్ లో 70వేల 665 సీట్లు కేటాయించారు. మిగిలిన 12వేల సీట్లు భర్తీ కాలేదు.
సీటు పొందిన విద్యార్థలు 2023 జూలై 22 లోపు సెల్ప్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. కోర్సుల వారిగా తొలి విడతలో CSEలో అత్యధికంగా 94.20%సీట్ల భర్తీ కాగా EEE లో 58.38% సీట్లు, CIVILలో 44.76% సీట్లు మెకానికల్ ఇంజనీరింగ్ లో 38.50% సీట్లు భర్తీ అయ్యాయి.