
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో గతేడాది వచ్చిన మూవీ " పుష్ప". రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ముందునుంచి ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడ కూడా తగ్గకుండా థియేటర్లో సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఏకంగా 300 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక సినిమాలోని పాటలు ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవీ మ్యూజిక్,చంద్రబోస్ లిరిక్స్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ మొత్తం 5 బిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. ప్రతీ పాటను ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టే పుష్ప సాంగ్స్ మ్యూజికల్గా సంచలనాలు సృష్టించాయని చెప్పాలి. కాగా ఈ సినిమా ఇప్పుడు సిక్వెల్ కు రెడీ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తోంది.