
అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన చిత్రం ‘బడ్డీ’(Buddy). గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్స్. శుక్రవారం (ఆగస్ట్ 2న) సినిమా థియేటర్లలలో రిలీజ్ అయింది. యాక్షన్, కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో తెరకెక్కిన ‘బడ్డీ' బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
తమిళంలో ఆర్య హీరోగా 2021లో రిలీజైన టెడ్డీ మూవీ నుంచి ప్రేరణ పొంది తెలుగులో మార్పులు చేర్పి చేసి బడ్డీ రూపొందింది. ప్రస్తుతం బడ్డీ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆగస్ట్ 2న రిలీజ్ కాగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ అయ్యేలా మేకర్స్ నెట్ ఫ్లిక్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్. ఆగస్ట్ లాస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో బడ్డీ స్ట్రీమింగ్కి రానుంది.
దాదాపు రెండేళ్ల తర్వాత అల్లు శిరీష్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అంతేకాదు ఫస్ట్ టైమ్ యాక్షన్ రోల్లో కనిపించాడు. కానీ అతడికి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా అల్లు శీరీస్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ లో ఉంది. బడ్డీ మూవీకి రామ్ చరణ్ ధ్రువ ఫేమ్ హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించాడు. టికెట్ రేట్లను తగ్గిస్తూ ఈ మూవీని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.