అల్వాల్, వెలుగు: విశాఖపట్నం నుంచి అల్వాల్కు గంజాయి తరలిస్తున్న ముఠాను అల్వాల్ పోలీసులు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 31 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాహుల్ దేవ్ తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు అల్వాల్ లక్ష్మి కళ టాకీస్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు.
విశాఖపట్నంకు చెందిన సోమేశ్వరరావు, రాజశేఖర్, పాండులను అరెస్టు చేయగా మరో ఇద్దరు కొండబాబు, ఇంద్ర కుమారులు పరారయ్యారు. వారి వద్ద 31 కిలోల గంజాయి స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.