ఆర్టీసీ డ్రైవర్​కు ఫైన్ వేసిన అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు

ఆర్టీసీ డ్రైవర్​కు ఫైన్ వేసిన అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు

జీడిమెట్ల, వెలుగు: అతివేగంగా బస్సు నడిపిన ఆర్టీసీ బస్సు డ్రైవర్​కు అల్వాల్ ట్రాఫిక్​ పోలీసులు జరిమానా విధించారు. జాతీయ రహదారి పై మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. ప్రమాదస్థలాన్ని  ట్రాఫిక్​, లా అండ్​ ఆర్డర్​ పోలీసులు బుధవారం ఉదయం  పరిశీలిస్తున్నారు.  అదే సమయంలో నిజామాబాద్​నుంచి సిక్రిందాబాద్​వైపు ఆర్టీసీ బస్సు అతివేగంగా వెళ్తుండడంతో ట్రాఫిక్​ సీఐ రవీందర్ రెడ్డి గమనించి రూ.1,500 జరిమానా విధించారు. ఈ బస్సుపై గతంలో రాజేంద్రనగర్​ప్రాంతంలో రూ.1,100 జరిమానా విధించగా పెండింగ్​లో ఉన్నట్లు తెలిసింది.