హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలాక్సీ క్రికెట్ క్లబ్కు చెందిన అమర్ నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు అంబుడ్స్ మన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2023లో జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫోర్జరీ పత్రాలతో జగన్ మోహన్ రావు పోటీ చేశారని అమర్నాథ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై అంబుడ్స్మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
సంస్థ కార్యకలాపాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో, రన్నరప్గా నిలిచి 62 ఓట్లు సాధించిన అమర్నాథ్ను అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నట్లు జస్టిస్ కైత్ తెలిపారు. అమర్నాథ్ వారం రోజుల్లోగా బాధ్యతలు స్వీకరించాలని, మిగిలిన తొమ్మిది నెలల కాలానికి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆదేశించారు.
