
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇండియాలో రూ. 2వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులు ప్రధానంగా కంపెనీ కార్యకలాపాల మౌలిక సదుపాయాల విస్తరణ, డెలివరీ వేగాన్ని పెంచడానికి, ఉద్యోగుల సంక్షేమానికి ఉపయోగించనుంది.
అమెజాన్ ఈ పెట్టుబడితో భారతదేశంలో కొత్త ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ హబ్లు, డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. అలాగే ఇప్పటికే ఉన్న వాటిని అప్గ్రేడ్ చేసి, లేటెస్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.
డెలివరీ బాయ్లకు విశ్రాంతి కేంద్రాలు, ఎకనామికల్ ఎడ్యుకేషనల్ కార్యక్రమాలు, ఆరోగ్య సేవలు వంటి సంక్షేమ చర్యలను కూడా ఈ పెట్టుబడులలో భాగంగా చేపట్టనున్నారు. ఇది ఉద్యోగాల కల్పనతో పాటు, స్థానిక వ్యాపారాలకు కూడా సహాయపడుతుందని భావిస్తుస్తోంది అమెజాన్ యాజమాన్యం.
అమెజాన్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త పెట్టుబడితో అమెజాన్ ప్రస్తుత మౌలిక సదుపాయాలు,దేశంలో అన్ని ప్రాంతాల్లో డెలివరీలను పెంచనుంది. దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా కస్టమర్లకు భద్రత, వేగం, స్థాయి ,విశ్వసనీయతను అందించేందుకు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను నిర్మించడం దృష్టి పెట్టనుందని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ చెప్పారు.
డిసెంబర్ లో న్యూఢిల్లీలో జరిగిన వార్షిక 'స్మ్బవ్ సమ్మిట్' ఐదవ ఎడిషన్ లో అమెజాన్ తన ఎగుమతులను నాలుగు రెట్లు పెంచేలక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి భారతదేశం నుంచి 80 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులను సాధించాలని భావిస్తోంది. అదనంగా వినియోగ వస్తువులను డిజిటలైజ్ చేస్తున్న స్టార్టప్లలో పెట్టుబడి పెట్టడానికి కంపెనీ తన 'స్మృవ్ వెంచర్ ఫండ్' నుంచి 120 మిలియన్ల డాలర్లను కేటాయించింది.