
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ కి పిలుపునివ్వడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్లలో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ పై ఎక్స్ వేదికగా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. హామీలు ఎగొట్టి.. పాప్కార్న్, ఐస్క్రీం, కూల్డ్రింక్స్ చవక చేసేందుకు సినిమా వాళ్లకే సినిమా చూపిస్తున్న వీరమల్లుకి వీరతాడు అంటూ ట్వీట్ చేశారు అంబటి.
ప్రస్తుతం అంబటి ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. తమ అభిమాన హీరోపై సెటైర్లు వేస్తావా అంటూ పవన్ ఫ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ అభిమానులు సెటైరికల్ మీమ్స్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకి మధ్య మొదలైన థియేటర్ల బంద్ వివాదం కాస్తా.. ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ గా మారింది. ఈ వివాదం ముదరడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు వంటివారు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
హామీలు ఎగొట్టి
— Ambati Rambabu (@AmbatiRambabu) May 29, 2025
Popcorn, Icecream, Cold Drinks చవక చేసేందుకు సినిమా వాళ్లకే
సినిమా చూపిస్తున్న
వీరమల్లు కి వీరతాడు !@PawanKalyan
ఎట్టకేలకు థియేటర్ల బంద్ ఆలోచన విరమించుకున్నప్పటికీ.. ఎగ్జిబిటర్ల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్లలో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్.రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. థియేటర్లలో అమ్మే స్నాక్స్, కూల్ డ్రింక్స్ రేట్లను డిస్ప్లే చేయటం, శుభ్రత పాటించడం వంటి అంశాలపై తనిఖీ చేయాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్.