ఎల్బీనగర్,వెలుగు: విద్యార్థులకు సేవలందించడంలో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని బీఆర్అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ స్టడీ సెంటర్ లో స్టూడెంట్స్ కు ప్రీ కౌన్సెలింగ్ ఇండక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. గెస్ట్గా ఆయన పాల్గొని మాట్లాడారు. స్టడీ సెంటర్ కో – ఆర్డినేటర్ శంకర్, పూర్వ విద్యార్థులు, స్టాఫ్, కౌన్సిలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ నెల 15 వరకు గడువు
ఓపెన్ వర్సిటీలో డిగ్రీలో చేరేందుకు ఈనెల15వరకు గడువు పెంచిన్నట్లు స్టడీ సెంటర్ కో – ఆర్డినేటర్ శంకర్ తెలిపారు. రూ.200ఫైన్తో వర్సిటీ అవకాశం కల్పించిందని, బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చని సూచించారు. పూర్తి వివరాలకు 7382929771 నంబర్లో లేదా హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని స్టడీ సెంటర్లో సంప్రదించవచ్చని తెలిపారు.