ఎన్విడియా సంస్థకు పోటీగా చిప్ తయారీ సంస్థ ఏఎండీ భారత్లో టీసీఎస్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ఏఐ డేటా సెంటర్ ద్వారా ఏఎండీ హీలియోస్ ప్లాట్ ఫామ్ను దేశంలో అందుబాటులోకి తెస్తారు.
200 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించనున్నారు. ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం దేశీయ సంస్థలకు ఎంతో మేలు చేస్తుందని టీసీఎస్ పేర్కొంది.
