రేపు నిర్మల్‌కు అమిత్ షా

రేపు నిర్మల్‌కు అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రేపు (శుక్రవారం) నిర్మల్‌కు రానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి నాందేడ్.. నాందేడ్ నుంచి హెలీకాఫ్టర్‌లో నిర్మల్ సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా నిర్మల్ సభ  దగ్గర రక్తదాన శిబిరం ప్రారంభించనున్నట్లు చెప్పారు. బహిరంగ సభ తర్వాత  అమిత్ షా.. నాందేడ్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది.