ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అస్సోం రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాల కారణంగా అక్కడి ప్రజలు నిరాశ్రయులవడం చూసి తన వంతుగా రూ.51 లక్షలు విరాళంగా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో లక్షలాది అస్సోం ప్రజలంతా నిరాశ్రయులయ్యారని, వారికి చేయూతనందించేందుకు తన వంతుగా సాయం చేశానని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మీరు కూడా మీ వంతుగా సీఎం సహాయ నిధికి తోచిన విరాళం అందించాలని బిగ్ బీ తన ఫాలోవర్లకు విజ్ఞప్తి చేశారు.
Assam is in distress .. the floods have caused great damage .. send care and assistance for our brothers and sisters .. contribute generously to the CM Relief Fund .. I just did .. HAVE YOU ..? ??? https://t.co/DZIpxZ0eOl
— Amitabh Bachchan (@SrBachchan) July 23, 2019