వైజయంతి ఆఫీస్ ఓపెనింగ్లో స్టార్ల సందడి

వైజయంతి ఆఫీస్ ఓపెనింగ్లో స్టార్ల సందడి
  • ఒకే ప్రేమ్లో ప్రభాస్, నాని, అమితాబ్
  • వైజయంతి ఆఫీస్ ఓపెనింగ్లో స్టార్ల సందడి

ప్రభాస్, నాని, అమితాబ్ లాంటి నటులు ఒకే ప్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ పిక్ నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ సందర్భం ఎందుకొచ్చిందంటే.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీ కోసం వైజయంతి సంస్థ గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ని ప్రారంభించింది. ఈ ఆఫీస్ ఓపెనింగ్ కోసం ప్రభాస్, నాని, రాఘవేంద్ర రావు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. వీరితో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ పై వేల కోట్లల్లో బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె ఇలా వరుస మూవీస్ లో ప్రభాస్ నటిస్తున్నాడు. ఆదిపురుష్ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సలార్, ప్రాజెక్ట్ కె సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయట. సలార్ సినిమాను కెజిఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ వండర్ గా తీర్చిదిద్దతున్నాడు యువ డైరెక్టర్ నాగ్ అశ్విన్. వైజయంతి బ్యానర్లో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ కాగా.. బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నిన్న వైజయంతి ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా స్టార్లందరూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మోస్ట్ మెమోరబుల్ అంటూ అమితాబ్ తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు హీరో నాని. వాట్ ఎన్ ఈవినింగ్ అంటూ అమితాబ్ ట్వీట్ చేశాడు.