
- మహబూబ్నగర్, కరీంనగర్, హైదరాబాద్లో పర్యటన
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల దాకా ఆయన మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ లో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ స్టేట్ కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం టూర్ షెడ్యూల్ను అధికారికంగా ఖరారు అయింది.
ఇదీ టూర్ షెడ్యూల్
ఆదివారం మధ్యాహ్నం 1.05 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. మధ్యాహ్నం 1.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్ వెళ్లి, 2.40 వరకు లోక్ సభ క్లస్టర్ పరిధిలోని నేతల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 4.10 గంటలకు కరీంనగర్కు చేరుకొని, సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతల సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్కు చేరుకొని, ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో రాత్రి 7.05 దాకా మహిళా సమ్మేళనంలో పాల్గొంటారు. తర్వాత 7.40కు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని, ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.