రేపు రాష్ట్రానికి అమిత్ షా

రేపు రాష్ట్రానికి అమిత్ షా
  •  మహబూబ్​నగర్, కరీంనగర్, హైదరాబాద్​లో పర్యటన

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల దాకా ఆయన మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ లో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ స్టేట్ కేడర్​కు దిశానిర్దేశం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం టూర్ షెడ్యూల్​ను అధికారికంగా ఖరారు అయింది. 

ఇదీ టూర్ షెడ్యూల్

ఆదివారం మధ్యాహ్నం 1.05 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. మధ్యాహ్నం 1.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్​లో మహబూబ్ నగర్ వెళ్లి, 2.40 వరకు లోక్ సభ క్లస్టర్ పరిధిలోని నేతల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 4.10 గంటలకు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకొని, సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతల సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్​కు చేరుకొని,  ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాత్రి 7.05 దాకా మహిళా సమ్మేళనంలో పాల్గొంటారు. తర్వాత 7.40కు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని, ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.