ప్రధాని మోడీకి వినూత్నంగా బర్త్ డే విషెష్

ప్రధాని మోడీకి వినూత్నంగా బర్త్ డే విషెష్

ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్..ఆయనకు వినూత్నంగా విషెష్ తెలిపారు. మోడీ 72వ పుట్టిన రోజు సందర్భంగా ఒడిశా పూరీ బీచ్​లో  ఒక వెయ్యి  213 మట్టి టీ కప్పులను ఉపయోగించి..మోడీ చిత్రాన్ని రూపొందించాడు. అందులో హ్యాపీ బర్త్​డే మోదీ అని రాసుకొచ్చారు.  5 ఫీట్ల పొడవున్న మోడీ ఆకృతి కోసం పట్నాయక్​ 5 టన్నుల ఇసుక వాడారు. మోడీ సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ప్రధాని 72వ జన్మదినం సందర్భంగా.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖర్​, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.