ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్..ఆయనకు వినూత్నంగా విషెష్ తెలిపారు. మోడీ 72వ పుట్టిన రోజు సందర్భంగా ఒడిశా పూరీ బీచ్లో ఒక వెయ్యి 213 మట్టి టీ కప్పులను ఉపయోగించి..మోడీ చిత్రాన్ని రూపొందించాడు. అందులో హ్యాపీ బర్త్డే మోదీ అని రాసుకొచ్చారు. 5 ఫీట్ల పొడవున్న మోడీ ఆకృతి కోసం పట్నాయక్ 5 టన్నుల ఇసుక వాడారు. మోడీ సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది.
Wishing Happy birthday to our Hon’ble PM @narendramodi ji, Through My SandArt at Puri beach ,Odisha .
— Sudarsan Pattnaik (@sudarsansand) September 17, 2022
We have used 1,213 mud tea cups on our SandArt to show the journey of PM Modi's from " a tea seller to an architect of #NewIndia with millions of blessings. pic.twitter.com/z655Rlbzlk
ప్రధాని 72వ జన్మదినం సందర్భంగా.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.