
- హకీంపేట ఎయిర్ఫోర్స్లో ఘటన
అల్వాల్, వెలుగు : ఎయిర్క్రాఫ్ట్లో మంటలు చెలరేగి ఓ ఆఫీసర్ చనిపోయాడు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చెందిన ఆఫీసర్ హర్వీర్ చౌదరి(సీపీఎల్ ర్యాంక్) శనివారం మధ్యాహ్నం అక్కడ ‘యూ 736 కిరణ్’ ఎయిర్క్రాఫ్ట్ను రిపేర్ చేస్తున్నాడు.
ఎయిర్క్రాఫ్ట్ సీటుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో హర్వీర్ చౌదరి తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సర్కార్.. అల్వాల్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.