మార్నింగ్ వాక్ కు వెళ్లి నాలాలో కొట్టుకుపోయిన వృద్ధురాలు

మార్నింగ్ వాక్ కు వెళ్లి నాలాలో కొట్టుకుపోయిన వృద్ధురాలు

సరూర్ నగర్ లో విషాదం జరిగింది. నాలాలో పడి ఓ వృద్ధురాలు మరణించింది. శారదా నగర్ కి చెందిన వృద్ధురాలు సరోజ(80) తెల్లవారుజామున ఉదయం ఆరుగంటలకు ఇంటి నుంచి వాకింగ్ కు వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుటాహుటిన డీఆర్ఎఫ్ టీమ్ ను , పోలీసులను , జీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసి , గాలింపు చర్యలు చేపట్టారు.  చైతన్యపురి లోని హనుమాన్ నగర్ నాలలో మృతదేహం దొరికింది. మృతదేహాన్ని వెలికితీసి , పోస్టు మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు.  శారదా టాకీస్ నాల వద్ద ముందస్తుగా జీహెచ్ఎంసీ అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.