కథ చెబుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాం : ఆనంద్ దేవరకొండ

కథ చెబుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాం :  ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్‌‌‌‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గం గంగ గణేశా’. కేదార్‌‌‌‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. దర్శకులు శివ నిర్వాణ, అనుదీప్ కేవీ, కార్తీక్ దండు, వినోద్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. 

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘బేబి’ సినిమాతో ఎంత ఎమోషనల్ అయ్యారో  ‘గం గం గణేశా’ లో అంత ఎంటర్ టైన్ అవుతారు. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూర్స్‌‌‌‌తో పనిచేస్తున్నా. ఫన్, క్రైమ్, యాక్షన్ వంటి అంశాలతో అందర్నీ ఆకట్టుకునే మూవీ ఇది. కథ చెబుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాం. థియేటర్‌‌‌‌‌‌‌‌లో ప్రేక్షకులు  కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ -‘మన లైఫ్‌‌‌‌లో ఏదో ఒక సందర్భంలో క్రేజీ క్యారెక్టర్స్ చూస్తుంటాం. అలాంటి క్రేజీ క్యారెక్టర్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. 

ALSO READ: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌గా మహేష్

ఆనంద్ లాంటి హీరో దొరికితే డెబ్యూ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఎంత కంఫర్ట్‌‌‌‌గా ఉంటుందో నేను ఈ సినిమాతో ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ చేశా. వినాయక చవితి చుట్టూ తిరిగే కథ ఇది. వినాయక చవితి పండుగను మనమంతా కలిసి సెలెబ్రేట్ చేసుకున్నట్లే ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.  టీజర్ ఎంత ఎనర్జిటిక్‌‌‌‌గా, కామెడీగా ఉందో మూవీ కూడా అంతే యాక్షన్ కామెడీతో ఉంటుందని చెప్పారు నిర్మాతలు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, సత్యం రాజేష్,  సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని పాల్గొన్నారు.