లారీని ఢీకొట్టిన కారు..నలుగురు మృతి

లారీని ఢీకొట్టిన కారు..నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తు నలుగురు ప్రాణాలను బలిగొంది. పెనుగొండ మండలం ఎర్రమంచి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టింది. కారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో బెంగళూరుకు చెందిన మనోజ్ మిట్టల్, ఢిల్లీకి చెందిన ఓ యువకుడితో పాటు.. మరో ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు పోలీసులు. మృతులు కిషన్ గంజ్ నార్త్ ఢిల్లీకి చెందిన రేఖ(21), ఆంచల్ సింగ్(21), మహబూబ్ ఆలం(31), బెంగళూరు ఆర్‌టీనగర్‌కు చెందిన మనోజ్ మిట్టల్ (38)గా గుర్తించారు పోలీసులు.