ఏపీలో కొత్తగా 1,316 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 1,316 కరోనా కేసులు

హైదరాబాద్: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,316 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. ఇందులో 16,000 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,35,801 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బుధ‌వారం వైరస్ కారణంగా 11 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,910కు చేరుకుంది. జిల్లాల వారీగా.. అనంతపురం 60, చిత్తూరు 198, తూర్పుగోదావరి 183, గుంటూరు 206, కడప 58, కృష్ణా 196, కర్నూలు 14, నెల్లూరు 40, ప్రకాశం 43, శ్రీకాకుళం 28, విశాఖపట్నం 45, విజయనగరం 18, పశ్చిమ గోదావరి 227 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.